అంగారక గ్రహానికి 'మామ్' ప్రయాణం మొదలైంది. వేలమంది ఇస్రో శాస్త్ర వేత్తల కృషి ఫలమిది. 'అంతటి ఘనత సాధించిన భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో శాస్త్ర వేత్తగా ఎంపికైనందుకు చాలా గర్వంగా ఉంది' అంటోంది ఇరవై ఒక్క ఏళ్ల శ్రావ్య. భారతదేశంలోని ఒకే ఒక్క స్పేస్ ఇంజినీరింగ్ కాలేజీలో ఉచిత సీటు సంపాదించి... చక్కని ప్రతిభతో అబ్దుల్ కలాం ప్రశంసలు అందుకుంది. అమ్మ ప్రోత్సాహంతో తన కలను నెరవేర్చుకున్న తీరుని శ్రావ్య ఇలా వివరిస్తోంది. ఇరవై ఒక్క ఏళ్లకే ఇస్రో శాస్త్రవేత్త అమ్మ చిన్నతనంలో ఆకాశం చూపిస్తూ గోరుముద్దలు తినిపించేది. నేను చందమామను చూసి ఆడు కుంటూ, అన్నం తింటుంటే ఎంతో ఆనందించేది. ఇవాళ నేను అంతరిక్ష పరిశోధన కేంద్రంలో ఉద్యోగం సంపా దించానంటే అంతే సంబరపడిపోతోంది. ఇరవై ఒక్క ఏళ్ల లో తన నుంచి అందిపుచ్చుకున్న స్ఫూర్తె నేడు నేను ఇస్రో శాస్త్రవేత్తగా నిలదొక్కుకోవడానికి కారణమైంది. మా ఆమ్మ కరుణశ్రీకి చదువంటే చాలా ఇష్టం. తనకు డిగ్రీ రెండో సంవత్సరంలో ఉండగా పెళ్లయింది. నాన్న శ్రావణ్ కుమార్ కరీంనగర్లో నీటిపారుదల శాఖ ఉద్యోగి. చదువు విలువ తెలిసిన అమ్మ పెళ్లయ్యాక ఊరకే ఉండలేదు. కాలేజీకెళ్లి డిగ్రీ పూర్తి చే...