1, మే 2026, శుక్రవారం

పెన్ ఆంటీ.. రతన్ బామ్మ@పుణె

 


నడక తడబడుతున్న చేతులు వణుకుతున్న ఎండ వానలను లెక్క చేయకుండా కొందరు వృద్ధులు పనులు చేస్తుంటారు. పేదరికం వల్ల, తప్పనిసరై ,బిడ్డలకు భారం కాకుండా, తాము ఒక చేయి వేయాలని కష్టం చేయడానికి  వాళ్లు రోడ్డు ఎక్కుతారు. ఏవైనా వస్తువులు అమ్మడం, హస్తకళా రూపాలు తయారు చేయడం, పాటతోను, వాద్యంతోను, అలరించడం చేస్తూ ఉంటారు. ప్రతిఫలంగానే తప్ప ఉచితంగా డబ్బు తీసుకోరు. సిగ్నల్ దగ్గర, బస్టాండ్లలో, రైల్వే స్టేషన్ఇ లలో ఇలాంటి వారు  ఎందరో కనిపిస్తుంటారు. కాకపోతే చూసే వారే తక్కువ, ఫోను తెరని తప్ప మరి దేనిని అంతగా పరిశీలించి చూసే అలవాటు తప్పిన ఈ రోజులలో ,ఆ ఫోన్ ద్వారా నే ఆ వృద్ధులకు తమ వంతు సహాయం చేస్తున్నారు కొందరు. నిజమైన హీరోలు వన్ టూ సామాజిక మాధ్యమాలలో వారు పంచుకుంటున్న ఫోటోలు మన సమాజం గురించి ఎన్నో విషయాలు చెబుతున్నాయి. 

ఐ డోంట్ వాంట్ టు బెగ్ - ప్లీజ్ బై మై పెన్స్అంటూ  ప్లకార్డ్ పట్టుకున్న వృద్ధురాలు ఆత్మ గౌరవానికి నెటిజన్లు ఫిదా అయ్యారు. మహారాష్ట్రలోని పూణేలో పెన్ ఆంటీ గా పేరు పొందిన రతన్ బామ్మ కొన్ని నాళ్ళ క్రితం సోషల్ మీడియాలో సెన్సేషన్ అయ్యింది. పెన్ను 10 రూపాయలు అంటూ బోసి నోటితో నవ్వుతున్న ఆమె ముఖం చూసి కొనకుండా ఎవరైనా ఉండగలరా ..నిజామాబాద్ పాత బస్టాండ్ దగ్గర ఎండలో పూలు అమ్ముతూ ఎదురైన వృద్ధురాలిని చూసి యువకుడు జాలిపడ్డాడు. జేబులోంచి నోటు తీసి ఇవ్వబోయాడు.. పూలు తీసుకో బాబు అప్పుడే ఈ డబ్బులు నావి అవుతాయి అంటూ దండం పెట్టింది ఆమె. కరోనా లాక్ డౌన్ తో గిరాకీ లేక కన్నీళ్లు పెట్టుకున్న ఢిల్లీలోని ఒక చిన్న హోటల్ దంపతుల గాథ  ఎందరినో  చలింప చేసింది. మా దగ్గర భోజనం చేయండి చాలు అంటూ ఒక వీడియోలో ప్రాధేయపడడంతో వాళ్ల బాబాకా దాబా ముందు జనాలు క్యూ కట్టారు. ముంబై రైళ్లలో చాక్లెట్లు బిస్కెట్లు అమ్ముతున్న 90 ఏళ్ల తాతయ్య, సెరిబ్రల్ పాలసీతో బాధపడుతూ కూడా తన కాళ్ళపై తాను నిలబడాలని కొంగర్లు తిరిగిన వేళ్ళతోనే వీడియో ఎడిటింగ్ చేస్తున్న 22 ఏళ్లకు యువకుడు.. ఇలాంటి ఎందరో ఏరీలు లోనో కనబడతారు .స్వావలంబన ,నిజాయితీలకు నిదర్శనాలుగా నిలుస్తారు.

ఉరుకులు పరుగుల జీవితంలో అందరిలా తలవంచుకుని ఫోను చూసుకుంటూ పోకుండా, తలెత్తి చుట్టూ చూసిన యువతరానికి కనపడిన సమాజ ప్రతిబింబాలు పైన చెప్పిన వాళ్ళు. వారిని చూసి ఒక్క క్షణం అయ్యో పాపం అని జాలిపడి స్క్రోల్ చేస్తూ మరుక్షణం లో మర్చిపోయే వారు ఎందరో. ఆత్మగౌరవంతో బ్రతికే ప్రయత్నం చేస్తున్నందుకు అబ్బురపడి మరొకరికి షేర్ చేసేవారు కొందరు .ఇంకొందరు ఉంటారు ,వారి వివరాలు తెలుసుకొని చేతనైన ఆర్థిక సహాయం చేసి మౌనంగా తమ పని తాము చూసుకుంటారు.వారిది ఆత్మ గౌరవం, వీరిది మానవీయ హృదయం . ఇద్దరికీ జోహార్లు చెప్పడం మన కనీస కర్తవ్యం.

29, జనవరి 2026, గురువారం

మహిళా జన అధికార్ సమితి,అజ్మీర్, రాజస్థాన్.

 డిజిటల్ యుగానికి అనుగుణంగా గ్రామీణ మహిళలకు నైపుణ్యాలను అందించడానికి ఎం జె ఏ ఎస్ చేస్తున్న ప్రయత్నాల్లో ఈ ఫిల్మ్ మేకింగ్ కోర్స్ ఒక భాగం. మొదట అన్హాద్ ఫిలిమ్స్ వీరికి శిక్షణ ఇచ్చింది .ఇప్పుడు డిజిటల్ రంగంలో అగ్రగామిగా ఉన్న పీర్ నేతృత్వంలోని మోడల్ విజయవంతం అయింది. వీరి ఆధ్వర్యంలో శిక్షణ పొందిన మహిళలు ఇప్పుడు ఇతరులకు ట్రైనింగ్ ఇస్తున్నారు.


బాల్యవివాహాల  సంకెళ్లలో చిక్కుకొని కష్టాల పాలైన అజ్మీర్ గ్రామీణ మహిళలు ఇప్పుడు చిన్న చిన్న సినిమాలను రూపొందిస్తున్నారు .డిజిటల్ యుగానికి అనుగుణంగా ఈ గ్రామీణ మహిళలు సాంకేతిక నైపుణ్యాలను నేర్చుకుని మహిళా కార్మికుల దయనీయ జీవితాలు గృహహింసపై అవగాహన కల్పించే ప్రయత్నం చేయడమే కాదు.. చాలావరకు విజయం సాధించారు కూడా . వీరు తమ ఆలోచనలను  సినిమా రూపకంగా గ్రామీణుల ముందుకు తీసుకువచ్చి సరికొత్త జీవన విధానం గురించి అవగాహన కల్పిస్తున్నారు. డిజిటల్ రంగంలో నైపుణ్యం సాధి ంచిన వీరు శిక్షకులుగా మారి మారుతున్న గ్రామీణ భారతానికి ఉదాహరణగా నిలుస్తున్నారు.

రాజస్థాన్లోని అజ్మీర్ లో అత్యంత సామాన్యంగా ఉండే రెండు అంతస్తుల భవనం ఉంది .అక్కడ ప్రతి ఉదయం ఒక నిశ్శబ్ద విప్లవం మేలుకుంటుంది. అన్ని వయసుల మహిళలు అక్కడ కనిపిస్తుంటారు. వారంతా బాల్య వివాహాల సంకెళ్ళకు బందీలే .నేడు ఆ మహిళలు బాలికలకు సాధికారత కలిపించడానికి మహిళా జన అధికార సమితి కార్యాలయంలోకి అడుగుపెడుతున్నారు. వీరంతా కెమెరాలు తీసుకొని షూటింగులకు వెళుతున్నారు. మరికొందరు తమ సినిమాలను ఎడిట్ చేయడానికి కంప్యూటర్ స్క్రీన్ల ముందు ఉంటున్నారు. అంతా కలిసి వారు కొత్త భవిష్యత్తుకు ఒక్కొక్క ఫ్రేమ్ నుస్క్రిప్ట్ చేస్తున్నారు.

డిజిటల్ అక్షరాస్యత ..మహిళా జన అధికార సమితి ఆఫీసులో 30 మందికి పైగా మహిళలు చిత్ర నిర్మాణం ఎడిటింగ్  నైపుణ్యాలను నేర్చుకుంటున్నారు. వారి కుటుంబాలలో కెమెరా పట్టుకొని ప్రపంచంపై దృష్టి సారించిన మొదటి వ్యక్తులు వీరే .పాతికేళ్ల క్రితం భూమి హక్కుల కోసం కుల వివక్ష బాల్యవివాహాలు పరువు హత్యలకు వ్యతిరేకంగా పోరాడిన మహిళల నేతృత్వంలోని అట్టడుగు వర్గాల నుంచి ఈ మహిళ జన అధికార సమితి పుట్టుకు వచ్చింది .నేడు అక్కడి మూడు జిల్లాలలో ఈ సమితి తన ఉనికిని కొనసాగిస్తోంది. డిజిటల్ అక్షరాస్యత, నాయకత్వ కార్యక్రమాలు, లింగ సమానత్వం, గృహహింసపై దృష్టి సారించింది. మహిళల ఆందోళనలను వ్యక్తపరచడానికి వారి జీవితాలలో, సమాజాలలో సానుకూల మార్పును తీసుకురావడానికి ఒక వేదికను ఏర్పాటు చేసింది.

గ్రామీణ మహిళల చేతిలో కంప్యూటర్ స్క్రీన్..

 ఈ ఆఫీసులోకి వెళ్లి చూస్తే ఎడిట్ రూమ్ లో 19 ఏళ్ల మంజు రావత్ తదేక దీక్షతో తన డెస్క టాప్ పైన సినిమాను ఎడిట్ చేస్తూ కనిపిస్తుంది .రెండేళ్ల క్రితం ఈ ఎన్జీవో లో చేరినప్పుడు ఆమె ఏకైక లక్ష్యం డిజిటల్ అక్షరాస్యత పొందడం .అయితే స్క్రిప్ట్, ఇంటర్వ్యూ ,కెమెరా వర్క్ తో సహా మహిళలకు ఫిల్మ్ మేకింగ్ నేర్పించాలని సంస్థ తీసుకున్న నిర్ణయం ఆమెలో ఆసక్తిని కలిగించింది. కంప్యూటర్ను ఎలా ఉపయోగించాలో నేర్చుకోవడానికి మొదట మా ఇంటి నుండి బయటకు వచ్చినప్పుడు అందరూ నన్ను చూసి నవ్వారు. కుటుంబంతో పాటు ఇరుగుపొరుగు వాళ్ళు ఆమె ఎలా తిరుగుతుందో చూడండి అనేవారు. కానీ వారి మాటలను పట్టించుకోలేదు అని చెబుతుంది మంజు రావత్. నాలుగేళ్ల వయసులోనే 20 ఏళ్ల వాడితో ముడిపెట్టిన చాందస కుటుంబం నుండి వచ్చిన రావత్ ఇప్పుడు తనలాంటి మహిళల సమస్యల పైన దృష్టి సారిస్తూ షార్ట్ ఫిలింలు తీసింది.

రావత్ చెల్లెలు సంజు వయసు 19 సంవత్సరాలు, ఆమె అజేసర్ గ్రామంలోని దినసరి కార్మికుల జీవితాలను చిత్రీకరించింది .

సవాళ్లను ఎదిరిస్తూ.. 24 ఏళ్ల భగవతి దేవికి 15 ఏళ్ల వయసులో  పెళ్లయి ంది. ఆమె తన గ్రామం భవానీ నుండి అజ్మీర్ కు ప్రతిరోజు 30 కిలోమీటర్ల దూరం ప్రయాణించేది .భగవతీదేవి ముసుగు ధరించే ఆచారం పైన, తగిన ధ్రువపత్రాలు లేకపోవడం వల్ల సంక్షేమ పథకాల నుండి మినహా యించిన సంచార జాతి ఘమంతు తెగపై సినిమాలను నిర్మించింది. కోర్సు నేర్చుకుంటున్న మహిళలందరూ ఒక్కొక్కరు ఒక్కో సినిమా తీశారు. వీరంతా పురుషుల నుంచి కుటుంబాల నుంచి తీవ్రమైన అణచివేతను ఎదుర్కొన్నవారే. 2025 ఏడాది మొదట్లో 23 ఏళ్ల సంత్ర చౌరాసియా, భగవతి దేవి మరో ఇద్దరూ కిషన్ ఘడ్ లో ఒక పెళ్లిని చిత్రీకరించారు. ఇది వారి మొదటి ప్రొఫెషనల్ ప్రాజెక్ట్. వీరు తీసిన సినిమాలను చూసిన స్థానిక మహిళలు సంతోషిస్తుండగా పురుషులు మాత్రం తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఎన్ని సవాళ్లు ఉన్నప్పటికీ మేమంతా ఒక్కటిగా నడుస్తాం. ఏ అమ్మాయి అయినా మా డిజిటల్ క్లాసులకు రాలేక పోతే మేమే వారి ఇంటికి వెళ్లి వెంటబెట్టుకొని వస్తాం .కుటుంబ ఒత్తిడి కారణంగా ఎవరు ఈ డిజిటల్ చదువు మానేయకుండా చూసుకోవాలని మేమంతా నిర్ణయం తీసుకున్నాం అని 22 ఏళ్ల మేరీ అంటున్నారు..

గతంలో మా కాలనీలో ఎడిటింగ్ నేర్చుకోవడానికి ఇంటి నుండి బయటకు వెళ్లే ఏకైక వ్యక్తిని నేనే. ఇప్పుడు చాలామంది మహిళలు నాతో చేరారు. ఇది మా సమిష్టి విజయం అని 21 ఏళ్ల ట్రైనర్ సమీరా భాను గర్వంగా చెబుతున్నారు. స్థానికంగా మహిళలు ఎదుర్కొంటున్న రకరకాల సమస్యల పైన సినిమాలు తీస్తూ వాటిని గ్రామంలో ప్రదర్శిస్తూ అవగాహన తీసుకువస్తున్నారు. మహిళాభివృద్ధికి ఏ విధంగా తోడ్పాటును అందించాలో తమ సినిమాల ద్వారా చూపుతున్నారు ఈ మహిళలు.


షీల్డ్ షూర్ ఇన్సూరెన్స్ ,థానే

 చిన్న పట్టణాలకు చెందిన ముగ్గురు మహిళలు కలిసి మన దేశ భీమా రంగంలో కొత్త అధ్యాయానికి శ్రీకారం చుట్టారు సంకల్ప బలం కలిగిన ఆ మహిళలు ఎవరంటే నైనా చౌహాన్ ,అనుశ్రీ వాస్తవ, షీబా నాజ్.

ఈ ముగ్గురు మహిళలు మన దేశంలో తొలిసారి డిస్కౌంట్ ఆధారిత బీమా స్టార్టప్ షీల్డ్ ఇన్సూరెన్స్ ప్రారంభించారు. థానే ప్రధాన కేంద్రంగా ప్రారంభమైన ఈ స్టార్టప్ కు నైనా చౌహాన్ ఫౌండర్, అను శ్రీ  శ్రీ వాస్తవ కో ఫౌండర్, షీబా నాజ్ సి ఓ ఓ గా వ్యవహరిస్తున్నారు.

ప్రతి భారతీయ కుటుంబానికి భీమాను అందుబాటులోకి తీసుకురావాలి అనే లక్ష్యంతో స్టార్టప్ ప్రారంభించారు వీరు. మిగిలిన కంపెనీలతో పోల్చితే షీల్డ్ ష్యూర్ ను ప్రత్యేకంగా నిలబెట్టేది మహిళా సాధికారికత పట్ల దాని బలమైన నిబద్ధత అంటుంది కోపౌండర్ అనుశ్రీ. దీనిలో 90 శాతం మందికి పైగా ఉద్యోగులు మహిళలే కావడం విశేషం. క్షేత్రస్థాయిలో కూడా ఎక్కువమంది మహిళలే ఉండేలా చూసుకోవాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. మా లక్ష్యం బీమాను అందుబాటులోకి తీసుకురావడమే కాకుండా భారతదేశం అంతటా మహిళలకు ఆర్థిక స్వాతంత్రాన్ని సృష్టించడం అంటుంది ఫౌండర్ నైనా. ప్రతి బీమా పాలసీపై ఐదు నుండి 25% డిస్కౌంట్ కూపన్లను అందిస్తోంది వీరి సంస్థ.



పర్యావరణహిత.. ప్రాజెక్టు ముంబై

 ప్లాస్టిక్ వ్యర్ధాలను పునర్వినియోగంలోకి తీసుకురావడానికి ముంబైలోని స్వచ్ఛంద సంస్థ " ప్రాజెక్టు ముంబై " ప్లాస్టిక్  రీసైక్లోథాన్ కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. చిన్నగా మొదలైన ఈ కార్యక్రమం ఉద్యమ స్థాయికి చేరింది. సాధారణ పౌరులు ఈ ఉద్యమంలో భాగమవుతున్నారు.

ప్రాజెక్టు ముంబైకి చెందిన స్వచ్ఛంద సేవకులు ఇంటింటికి వెళ్లి ప్లాస్టిక్ వ్యర్థాలను సేకరిస్తారు. విద్యార్థుల కోసం పాఠశాలలు కాలేజీలలో అవగాహన సదస్సులు నిర్వహిస్తోంది ప్రాజెక్టు ముంబై.  పౌరుల నేతృత్వంలో ప్లాస్టిక్ ని రీసైకిల్ చేయడానికి ఏర్పడిన అతిపెద్ద సంస్థగా లింకా బుక్ ఆఫ్ రికార్డ్స్ లో చోటు సాధి ంచింది ప్రాజెక్టు ముంబై. ఇప్పటివరకు 500 టన్నుల ప్లాస్టిక్ వ్యర్ధాలను పునర్వినియోగంలోకి తీసుకువచ్చింది. పార్కులలో పిల్లలు కూర్చునే బెంచీలను ,ఆడుకునే అందమైన బొమ్మలను, అందమైన చెత్త బుట్ట లను,ఇలా రకరకాల వస్తువులను తయారు చేసి ప్లాస్టిక్ ను పునర్వినియోగంలోకి తీసుకువచ్చింది.



బెంగళూరు రమేష్ బాబు

 బెంగళూరుకు చెందిన రమేష్ తండ్రి బార్బర్ గా పని చేసేవాడు. రమేష్ ఏడేళ్ల వయసులో ఉన్నప్పుడు తండ్రి చనిపోయాడు. కుటుంబ భారాన్ని భుజాల ఎత్తుకున్న తల్లి ఇండ్లలో పనిచేసేది .కుటుంబానికి ఆర్థిక ఆసరా కోసం చిన్న వయసు నుంచే న్యూస్ పేపర్ లు అమ్మడం ,పాల ప్యాకెట్లు అమ్మడం మొదలైన పనులు చేసేవాడు రమేష్ .హై స్కూల్ చదువు పూర్తయిన తర్వాత పై చదువుల కోసం రోడ్డు పక్కన చిన్న సెలూన్ షాప్ నడిపేవాడు. తాను పొదుపు చేసిన డబ్బుతో 1993లో మారుతి వ్యాను తీసు. అది అతని జీవితాన్ని మలుపు తిప్పింది. ఈ వ్యాన్ ను అద్దె కి తిప్పే వాడు..

ఒక్కొక్క మెట్టు ఎక్కుతూ రమేష్ టూర్స్ అండ్ ట్రావెల్స్ పేరుతో కార్ రెంటల్స్ కంపెనీ ప్రారంభించే స్థాయి కి చేరుకున్నాడు. రోల్స్ రాయిస్ ఘోస్ట్, బీఎండబ్ల్యూ, ల్యాండ్ రోవర్, డిఫెండర్ మొదలైన వాటితో తన కంపెనీని లగ్జరీ కార్ రెంటల్ సర్వీసెస్ స్థాయి కి తీసుకువెళ్లాడు.

 ప్రస్తుతం కంపెనీ 400 వాహనాలను ఆపరేట్ చేస్తోంది. మన దేశానికి సంబంధించి లగ్జరీ టాక్సిస్ సెగ్మెంట్లో రమేష్ బాబు మార్గదర్శిగా నిలిచాడు. తాజాగా రమేష్ బాబు తన కంపెనీలోకి మూడు కోట్ల 20 లక్షల విలువైన రేంజ్ రోవర్ లాంగ్ వీల్ బేస్ తీసుకొచ్చాడు. దీనికి సంబంధించిన ఫోటోలను కంపెనీ అధికారిక ఇంస్టా గ్రామ్ పేజీలలో షేర్ చేశారు. ఈ ఫోటోలో తన కుటుంబ సభ్యులతో కనిపిస్తారు రమేష్ బాబు.




27, మార్చి 2024, బుధవారం

శ్యామ హంగామా.. శ్యామా ద గామా

 నవ్వించడం అంటే నవ్వులాట ఏమీ కాదు యాగం ఎవరైనా చేయవచ్చు కానీ నలుగురిని నవ్వించాలంటే మాత్రం యోగం ఉండవలసింది అలాంటి యోగాన్ని పొంది హాస్య యాగాన్ని చేస్తున్నారు ప్రముఖ స్టాండ్ అఫ్ కమెడియన్ శామా హరిణి వేసే ప్రతి పంచుపండిన ముల్లులా అది ఎవరిని గుచ్చకపోవడం ఆమె ప్రత్యేకత నలుగురు నడవని దారులు నడుస్తూ పదవుని పగలబడి నవ్వించే ఆమె ఈ విభిన్నమైన వృత్తిలోకి ఎలా వచ్చారు అందులో తన ప్రయాణాన్ని ఎలా కొనసాగిస్తున్నారు అంటే

హాస్యం ఎక్కడి నుంచో పుట్టదు మన రోజువారి జీవితంలో జరిగే సంఘటనలోనే దానికి మూలాలు ఉంటాయి. నేనైతే ప్రోగ్రాములకు స్క్రిప్ట్ తయారు చేసేటప్పుడు నాకు తారాసపడ్డ సందర్భాలని తీసుకుంటా వాటినే కాస్త నవ్వు పుట్టించేలా చెబుతా అందులో వాస్తవానికి దూరంగా మనం మాట్లాడుకోలేని విధంగా ఉండే జోకులకు ఆస్కారం ఉండదు కదా బహుశా అందరూ నా హాస్యాన్ని సున్నితంగా ఉందని హుందాగా ఉంటుందని అనడానికి కారణం ఇదేనేమో దాని వల్లే నేను షోలు చేసేటప్పుడు నలుగురు కనెక్ట్ అవుతున్నారని అనుకుంటాను మనం గమనిస్తే స్కూలు కాలేజీ ఆఫీసు ఫంక్షన్లు ఇలా ప్రతి చోటా జరిగే సంఘటనలు హాస్యం తొంగి చూస్తూ ఉంటుంది మీకు ఒక ఉదాహరణ చెబుతాను మనం చిన్నప్పుడు ఇంగ్లీష్ కర్సివ్ రైటింగ్ రాసే వాళ్ళం గుర్తుందా నిజానికి అప్పటికే కంప్యూటర్లు వచ్చేశాయి అయినా కాపీ బుక్ లలో రోజు కలిసి రైటింగ్ రాయించేవారు ఒకవేళ రాయకపోతే వీళ్ళ మీద చేతి మీద కొ ట్టేవారు అసలు రాసేదే చేతితో దాని మీదే కొడితే మళ్ళీ ఎలా రాయగలమండి అసలు నాకీ విషయమే అర్థం కాదు అనగానే ఎవరైనా సరే పక్కన నవ్వేస్తారు ఇలాంటి క్లాస్ రూమ్ జోకులు నా కామెడీలో చాలా చూడవచ్చు

నాటకాల నుంచి ఇలా స్టాండప్ కామెడీ వైపు రావాలని నేను చిన్నప్పటినుంచి కంకణాలు తాయత్తులో అది ఏమీ కట్టుకోలేదు అలా జరిగిపోయింది అంతే అలా ఎలా జరిగిందో కూడా చెబుతాను మా నాన్న వాళ్ళ విజయవాడ అమ్మది బందరు నా చిన్నతనంలో ఎక్కువగా బందర్ కు వస్తూపోతూ ఉండేవాళ్ళం అయితే నాన్న వ్యాపార రీత్యా మేము చెన్నైలో స్థిరపడ్డాం. నా చదువు కూడా ఇక్కడే కొనసాగింది నేను ఎమ్మె చేశాను డిగ్రీలో ఉండగానే పాకెట్ మనీ కోసం పార్ట్ టైం జాబ్ చేసేదానిని అలా ఏవం అనే ఓ డ్రామా స్టాండ్ ప్రోగ్రాంలో కంపెనీలో ఆర్గనైజర్ గా చేరాను నాకు చిన్నప్పటినుంచి నాటకాలు అంటే ఇష్టము స్కూలు కాలేజీల్లో డ్రామాలు వేసే వాళ్ళం స్టేజీల మీద పెర్ఫార్మన్స్ ఇవ్వడం అన్నది ఓ సరదా దీనితో ఈ సంస్థలో పనిచేసే అప్పుడే స్టాండప్ కమెడి ప్రయత్నించాలన్న ఆలోచన వచ్చింది. స్క్రిప్ట్ తయారు చేసుకుని ప్రాక్టీస్ ప్రారంభించాను అలా నేను ఏమి మొదటి సంవత్సరంలో ఉండగా 2018లో నా తొలి స్టాండప్ కామెడీ షో చేశాను ప్రశంసలు బాగానే వచ్చాయి

అదే ఆనందం నా షో చూసి చాలా బాగుంది మీరు బాగా చెప్తారు అనడం చాలా సంతోషంగా అనిపిస్తుంటుంది ఎందుకంటే కళాకారులకు ప్రశంసకు మించిన పురస్కారం మరొకటి ఉండదు నాకు కారం లాంటి ఇష్టం అందుకే వాటికి సంబంధించిన డ్రెస్ లు ఎక్కువగా వేసుకుంటాను కార్పొరేట్ ఆఫీసులు ప్రైవేట్ ఈవెంట్లు ఇలా అన్నీ కలిపి ఇప్పటికీ 60 దాకా షోలు చేసి ఉంటాను తెలుగు తమిళం ఇంగ్లీష్ మూడు భాషల్లోనూ కార్యక్రమాలు చేస్తాను తెలుగులో యూట్యూబ్ కామెడీ షో ఖుషి ఖుషీగాలు విన్నర్ అయ్యాను అలాగే amazon prime వాళ్ళ కార్యక్రమం కోసం స్టాండ్ ఆఫ్ కమెడియన్లు అందరం రెండు నెలలు ఒకే హోటల్లో ఉండి ప్రదర్శనలు ఇవ్వడం ఒక మంచి అనుభూతి ఓటిటి ప్లాట్ఫామ్ ఆహాలు వేరమారి ఆఫీస్ అనే సిరీస్ తో పాటు తమిళ్లోనే మరో వెబ్ సిరీస్ నటించాను అది త్వరలో ప్రేక్షకుల ముందుకు రానున్నది నాకు దర్శకుడు జంధ్యాల గారి హాస్యం అంటే ఇష్టం ఫేవరెట్ కమెడియన్లు చాలామంది ఉన్నా బాగా నచ్చే కమెడియన్ అంటే శ్రీ లక్ష్మీ గారు అని చెబుతాను ఇక శ్యామా తగ్గామా పేరిట ఒక యూట్యూబ్ ఛానల్ ఇటీవలే ప్రారంభించాను ఒక మహిళగా ఆడవాళ్ళ సమస్యలను వాళ్లకు సంబంధించిన విషయాలను సున్నితంగా హాస్య రూపంలో నలుగురితో పంచుకుంటుంటాను ఈ రంగంలో మహిళా కమెడియన్లు తక్కువ మరింత మంది స్టాండ్ అప్ కమెడియన్లుగా వస్తే ఆడవాళ్లకు సంబంధించిన మరిన్ని విషయాలు ప్రస్తావనకు వస్తాయి అది తప్పకుండా స్త్రీలపై ఎదుటి వాళ్ళ దృష్టికి కూడా మారడానికి సహాయపడుతుంది అందుకే నాలాగే ఇంకొందరు ఆడపిల్లలు ఈ వృత్తి లోకి రావాలని ఆశిస్తాను అన్నారు శామాహారిణి

సాగర్ కన్వర్ రాజస్థాన్

 నువ్వేం చేయగలవు ఆడవాళ్లకు ఇవి అవసరమా ఇలాంటి మాటలు వినగానే నిరుత్సాహం ఆవరించి చేస్తుంది కానీ సాగర్ కన్వర్ 16 ఏళ్లకే పెళ్లి చేసిన సంప్రదాయాలు సామాజిక కట్టుబాట్లంటూ అడ్డుపడిన వాటన్నింటినీ దాటి ముందుకు వచ్చింది సేంద్రియ సాగుతూ వందల మంది మహిళల జీవితాల్లో మార్పు తెచ్చింది రాజస్థాన్లోని శిరోహి జిల్లాలోని వీరు వాడ అనేకు గ్రామం 16 ఏళ్లకే పెళ్లి చేసే అత్తారింటికి పంపించారు పుట్టింటి వాళ్ళు ఆ తర్వాత పిల్లల ఆలనా పాలన పొలం పాడిపన్నుల్లో భర్తకు సహాయం ఇలా ఒకదాని తర్వాత మరొక పని చేస్తూనే రోజులు గడిపేయడం తనకి నచ్చలేదు ఇంకా ఏదైనా చేస్తే బాగుంటుందని భావించింది ఆలోచించగా గ్రామస్తులకు ప్రధాన ఆదాయ వనరు అయిన పాల ఉత్పత్తిని పెంచేందుకు ఒక సొసైటీని ప్రారంభించాలనుకుంటే ఇంట్లో మొదట ఒప్పుకోకపోయినా తర్వాత సరైన అనడంతో తోటి వారిని కలుపుకొని ఆశ మహిళ మిల్క్ ప్రొడ్యూసర్ కంపెనీ లిమిటెడ్ పేరుతో సొసైటీ ప్రారంభించింది 

గ్రామస్తులకు ఇది బాగా ఉపయోగపడి పాల ఉత్పత్తి పెంచారు 2016లో టాటా ట్రస్ట్ డైరీ మిషన్తో పాటు జిల్లాలోని మరికొన్ని సంస్థలు వీరికి సాంకేతిక సహాయం అందించాయి సాగర్ సాధించిన ఈ తొలి విజయంతో సొసైటీ విస్తరించింది పరుగు గ్రామాల ప్రజలు ఇందులో సభ్యులుగా చేరారు మరోవైపు వ్యర్ధాలతో సేంద్రీయ ఎరువుల తయారీపై దృష్టి పెట్టింది అలా వచ్చిన ఉత్పత్తిని స్థానిక రైతులకు తక్కువకే విక్రయించడంతోపాటు తాను సేంద్రియ సాగు చేసి రైతుల్లో స్ఫూర్తిని రగిలించింది ఇవన్నీ అక్కడి వారి ఆదాయాలు గణనీయమైన మార్పులు తీసుకొచ్చాయి ఈ కృషికి గుర్తింపు గానీ ఈ ఏడాది జనవరిలో భారతీయ పరిశ్రమల సమాఖ్య సిఐఐ ఎక్సలెన్స్ అవార్డుని అందించింద

ఫార్మర్ ప్రొడ్యూసర్ ఆర్గనైజేషన్ ఎక్సలెన్స్ అవార్డును కూడా అందుకుంది ఇప్పుడు 400 మంది మహిళలతో స్వయం సహాయక సంఘాన్ని నడిపిస్తోంది సాగర్కి ఇద్దరు పిల్లలు అబ్బాయి ప్రేమ్ జీ విశ్వవిద్యాలయం నుంచి పట్టానందుకోగా అమ్మాయి బెంగళూరులో గ్రాడ్యుయేషన్ చేస్తుంది అసలు కుటుంబాన్ని పట్టించుకుంటున్నావా అంటూ చాలామంది విమర్శించారు ఇంకా బయట సమన్వయం కష్టమే గెలుపు కోసం ఓపిగ్గా ఎదురు చూడాలి అంతేకానీ కలని వదులుకుంటామా అంటోంది సాగర్ కణ్వర్.



Featured post

MANALO MANAM ...MANATHO MANAM