షీల్డ్ షూర్ ఇన్సూరెన్స్ ,థానే

 చిన్న పట్టణాలకు చెందిన ముగ్గురు మహిళలు కలిసి మన దేశ భీమా రంగంలో కొత్త అధ్యాయానికి శ్రీకారం చుట్టారు సంకల్ప బలం కలిగిన ఆ మహిళలు ఎవరంటే నైనా చౌహాన్ ,అనుశ్రీ వాస్తవ, షీబా నాజ్.

ఈ ముగ్గురు మహిళలు మన దేశంలో తొలిసారి డిస్కౌంట్ ఆధారిత బీమా స్టార్టప్ షీల్డ్ ఇన్సూరెన్స్ ప్రారంభించారు. థానే ప్రధాన కేంద్రంగా ప్రారంభమైన ఈ స్టార్టప్ కు నైనా చౌహాన్ ఫౌండర్, అను శ్రీ  శ్రీ వాస్తవ కో ఫౌండర్, షీబా నాజ్ సి ఓ ఓ గా వ్యవహరిస్తున్నారు.

ప్రతి భారతీయ కుటుంబానికి భీమాను అందుబాటులోకి తీసుకురావాలి అనే లక్ష్యంతో స్టార్టప్ ప్రారంభించారు వీరు. మిగిలిన కంపెనీలతో పోల్చితే షీల్డ్ ష్యూర్ ను ప్రత్యేకంగా నిలబెట్టేది మహిళా సాధికారికత పట్ల దాని బలమైన నిబద్ధత అంటుంది కోపౌండర్ అనుశ్రీ. దీనిలో 90 శాతం మందికి పైగా ఉద్యోగులు మహిళలే కావడం విశేషం. క్షేత్రస్థాయిలో కూడా ఎక్కువమంది మహిళలే ఉండేలా చూసుకోవాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. మా లక్ష్యం బీమాను అందుబాటులోకి తీసుకురావడమే కాకుండా భారతదేశం అంతటా మహిళలకు ఆర్థిక స్వాతంత్రాన్ని సృష్టించడం అంటుంది ఫౌండర్ నైనా. ప్రతి బీమా పాలసీపై ఐదు నుండి 25% డిస్కౌంట్ కూపన్లను అందిస్తోంది వీరి సంస్థ.



కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

DR.PAVULURI KRISHNA CHOWDARY GARU - RENOWNED HOMEO PHYSICIAN - ANDHRA PRADESH

IN THE LAST DAYS OF TANGUTURI PRAKASAM PANTHULU