పర్యావరణహిత.. ప్రాజెక్టు ముంబై

 ప్లాస్టిక్ వ్యర్ధాలను పునర్వినియోగంలోకి తీసుకురావడానికి ముంబైలోని స్వచ్ఛంద సంస్థ " ప్రాజెక్టు ముంబై " ప్లాస్టిక్  రీసైక్లోథాన్ కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. చిన్నగా మొదలైన ఈ కార్యక్రమం ఉద్యమ స్థాయికి చేరింది. సాధారణ పౌరులు ఈ ఉద్యమంలో భాగమవుతున్నారు.

ప్రాజెక్టు ముంబైకి చెందిన స్వచ్ఛంద సేవకులు ఇంటింటికి వెళ్లి ప్లాస్టిక్ వ్యర్థాలను సేకరిస్తారు. విద్యార్థుల కోసం పాఠశాలలు కాలేజీలలో అవగాహన సదస్సులు నిర్వహిస్తోంది ప్రాజెక్టు ముంబై.  పౌరుల నేతృత్వంలో ప్లాస్టిక్ ని రీసైకిల్ చేయడానికి ఏర్పడిన అతిపెద్ద సంస్థగా లింకా బుక్ ఆఫ్ రికార్డ్స్ లో చోటు సాధి ంచింది ప్రాజెక్టు ముంబై. ఇప్పటివరకు 500 టన్నుల ప్లాస్టిక్ వ్యర్ధాలను పునర్వినియోగంలోకి తీసుకువచ్చింది. పార్కులలో పిల్లలు కూర్చునే బెంచీలను ,ఆడుకునే అందమైన బొమ్మలను, అందమైన చెత్త బుట్ట లను,ఇలా రకరకాల వస్తువులను తయారు చేసి ప్లాస్టిక్ ను పునర్వినియోగంలోకి తీసుకువచ్చింది.



కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

DR.PAVULURI KRISHNA CHOWDARY GARU - RENOWNED HOMEO PHYSICIAN - ANDHRA PRADESH