బెంగళూరు రమేష్ బాబు

 బెంగళూరుకు చెందిన రమేష్ తండ్రి బార్బర్ గా పని చేసేవాడు. రమేష్ ఏడేళ్ల వయసులో ఉన్నప్పుడు తండ్రి చనిపోయాడు. కుటుంబ భారాన్ని భుజాల ఎత్తుకున్న తల్లి ఇండ్లలో పనిచేసేది .కుటుంబానికి ఆర్థిక ఆసరా కోసం చిన్న వయసు నుంచే న్యూస్ పేపర్ లు అమ్మడం ,పాల ప్యాకెట్లు అమ్మడం మొదలైన పనులు చేసేవాడు రమేష్ .హై స్కూల్ చదువు పూర్తయిన తర్వాత పై చదువుల కోసం రోడ్డు పక్కన చిన్న సెలూన్ షాప్ నడిపేవాడు. తాను పొదుపు చేసిన డబ్బుతో 1993లో మారుతి వ్యాను తీసు. అది అతని జీవితాన్ని మలుపు తిప్పింది. ఈ వ్యాన్ ను అద్దె కి తిప్పే వాడు..

ఒక్కొక్క మెట్టు ఎక్కుతూ రమేష్ టూర్స్ అండ్ ట్రావెల్స్ పేరుతో కార్ రెంటల్స్ కంపెనీ ప్రారంభించే స్థాయి కి చేరుకున్నాడు. రోల్స్ రాయిస్ ఘోస్ట్, బీఎండబ్ల్యూ, ల్యాండ్ రోవర్, డిఫెండర్ మొదలైన వాటితో తన కంపెనీని లగ్జరీ కార్ రెంటల్ సర్వీసెస్ స్థాయి కి తీసుకువెళ్లాడు.

 ప్రస్తుతం కంపెనీ 400 వాహనాలను ఆపరేట్ చేస్తోంది. మన దేశానికి సంబంధించి లగ్జరీ టాక్సిస్ సెగ్మెంట్లో రమేష్ బాబు మార్గదర్శిగా నిలిచాడు. తాజాగా రమేష్ బాబు తన కంపెనీలోకి మూడు కోట్ల 20 లక్షల విలువైన రేంజ్ రోవర్ లాంగ్ వీల్ బేస్ తీసుకొచ్చాడు. దీనికి సంబంధించిన ఫోటోలను కంపెనీ అధికారిక ఇంస్టా గ్రామ్ పేజీలలో షేర్ చేశారు. ఈ ఫోటోలో తన కుటుంబ సభ్యులతో కనిపిస్తారు రమేష్ బాబు.




కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

DR.PAVULURI KRISHNA CHOWDARY GARU - RENOWNED HOMEO PHYSICIAN - ANDHRA PRADESH

IN THE LAST DAYS OF TANGUTURI PRAKASAM PANTHULU