26, ఏప్రిల్ 2012, గురువారం

THE LAST DAYS OF ACTOR SHOBHAN BABU



teలుగు సినీరంగంలో 'సోగ్గాడు' శోభన్బాబు, సినీ
రంగం మీద మమకారంతో చెన్నపట్నం చేరిన
చాలామందిలాగానే కాళ్ళు అరిగేలా సినిమా స్టూడియోల
చుట్టూ తిరిగినవాడు. ఒక అవకాశంరాగానే దానిని అంటి
పుచ్చుకుని, సినీరంగంలో స్థిరపడి నటనలో కన్నా పంపు
దలో ఆకాశమంత ఎత్తుకు ఎదిగిన హీరో.
నిజజీవితంలో మనం ప్రతి ఒక్కరి నుండి ఏదో ఒకటి
నేర్చుకోవచ్చు. కొందరి జీవితాలు చూసి ఎలా జీవించాలో
తెలుసుకుంటే, మరికొందరి జీవితాలు చూసి ఎలా
బతకకూడదో తెలుసుకోవచ్చు,
శోభన్బాబు రెండవ సూత్రాన్ని బాగా వంటపట్టించు
కున్నాడు. తన ముందు తరం నటులనుండి నటన ఎంత
నేర్చుకున్నాడో కాని ఆర్థిక వ్యవహారాలలో ఎలా వ్యవహ
రించాలో మాత్రం బాగా నేర్చుకున్నాడు.
లక్షలాది రూపాయలు రెమ్యునరేషన్ తీసుకుంటూ,
కోట్లాది రూపాయల ఆస్తులు కూడగట్టుకుని కూడా
వాటిని ఎలా కాపాడుకోవాలో తెలియక చందాలు వేసు
కుని శవయాత్ర జరిపించుకున్న నటులున్నారు.
తన అందచందాలు శాశ్వతమనుకుని, ఆ అందచందా
లను చూసి వశమయ్యే అమ్మాయిల మత్తులో తేలియాడి
జీవితం నరకం చేసుకున్న తన సాటి హీరోని చూశాడు.
నటనలో ఒక స్థాయికి చేది, తను సంపాదించినది తిరిగి
సొంత సినిమాల మీద పెట్టి చేతులు కాల్చుకున్న వారిని
చూశాడు. అందుకే శోభన్బాబు జీవితం భిన్నంగా
సాగింది. ఒక బరి తీసుకుని జీవించాడు.
నటన తన వృత్తి. తన నటనమీద పెట్టుబడి పెట్టి
డబ్బు చేసుకుంటున్నారు నిర్మాతలు. కాబట్టి అందులో
తనకు రావాల్సిన డబ్బు తాను అందుకుంటున్నాడు.
అందులో తప్పు ఏమీ లేదు. అదీ ఆయన సినీరంగంలో
మూడున్నర దశాబ్దాలు పాటించిన సూత్రం.
సంపాదించిన డబ్బు తనకు తప్పించి మరెవరికీ
చెందదు. ఇప్పుడు మనం ఎవరికైనా అందించినా తిరిగి
కష్టాలలో ఉన్నప్పుడు వెనక్కి తిరిగి ఇస్తారనే నమ్మకం
లేదు. అందుకే శోభన్బాబు తన సంపద మొత్తాన్ని
తోటలు, స్థలాలు, భవనాల మీద పెట్టాడు.
మద్రాసు నగరంలో 50 బిల్డింగులు కలిగివుండట
మంటే మాటలు కాదు. బహుశా సినీరంగంలో అందరి
కన్నా సంపద కలిగిన వ్యక్తి శోభన్ బాబేనేమో!
తెలుగు సినీరంగం హైదరాబాద్ కి తరలివెళుతున్న
ప్పుడు మద్రాసు వదిలి రాలేని పరిస్థితి.
ఫలితంగా శోభన్ బాబు నెమ్మదిగా ఒంటరివాడనడం
మొదలైంది. కొత్త దర్శకులు, కొత్త కథనాలు, కొత్త
హీరోలు... ఇక తనకు అవకాశాలు తగ్గడం సహజం అనే
విషయం చాలా ముందుగా గుర్తించాడు.
ఇంతకాలం నిర్మాతలు క్యూ కట్టి పాత్రలు ఇచ్చిన
పరిశ్రమలో హీరో కాని పాత్రకోసం నిర్మాతలను ఆడగ
టానికి ఆయనకి అహం అడ్డు వచ్చింది. అందుకే 1996
జనవరి 1న తన సినీరంగ రిటైర్మెంట్ ప్రకటించాడు.
ఆ తర్వాత ఆయన మళ్ళీ ఎందరు ఎంతగా ఆశ పెట్టినా
ముఖానికి రంగు వేసుకోలేదు.
అప్పటినుండి ఆయన చివరిరోజులు అనుకుంటే
దానిని మొదటి ఐదు సంవత్సరాలు ఒక రకంగా, ఆ
తర్వాత ఏడేళ్ళు మరో రకంగా సాగించాడు.
1996 తర్వాత సినిమాలలో నటించడం మానేసినా
బహిరంగంగా కనిపించడం ఆపలేదు. కారు నడపడం
బాగా ఇష్టపడే శోభన్బాబు తనే సొంతంగా డ్రైవ్ చేసు
కుంటూ తన బిల్డింగ్ ను ఒకసారి అలా చూసుకుని
సంతోషపడి వస్తుండేవారు. తాను సంపాదించుకున్న
ఆస్తుల మీదకన్నా తనకు భగవంతుడు ఇచ్చిన రూపం
మీద,
దానిని సినీరంగంలో మలచుకున్న అందచందాల
మీద మక్కువ ఎక్కువ
శోభన్బాబుకి,
ముసలివాడివవు-సినిమా షూటింగ్ శోభన్బాబు అంగీ
లప్పుడు మేకప్ జాగ్రత్తలు | తర్వాత ఇల్లు
వదిలి
నిర్మాతలు, సినీరంగ నిప్పు
నలుగురికి కనిపించ
ణులు చూసుకునేవారు.
కాని ఇప్పుడు ఆయన
కాదు. వయసుతో
తనకు తాను స్వయంగా | మార్పుల్ని అంగీకరి-
చూసుకోవాల్సివచ్చింది.
ఆయనకు అల
ఆయన గ్లామర్ మీద
ఆయనకెంతో నమ్మకం. ఒకింత గర్వం కూడా. ఆ గ్లామర్
తోనే ఆయనకు గుర్తింపు, గ్లామర్ పోతే గుర్తింపు ఎక్కడ
పోతుందోనన్న భయం వెంటాడేది. ఐదేళ్ళ పాటు తన
గ్లామర్ సొంత ఖర్చుతో భరించుకుంటూ వచ్చినా
2001లో ఒక ఫంక్షన్ లో ఒకామె పెద్దవారైపోతున్నారనడం
శోభన్బాబు గ్లామర్ అహానికి పెద్దదెబ్బ తగిలింది.
శోభన్ బాబుకి ఒంటరితనం ఇష్టం. పరిమితమైన
స్నేహాలు. అందుకే ఆ ఆతిదగ్గరి స్నేహితులతో మద్రాసు
వీధుల్లో డ్రైవింగ్ చేసుకుంటూ వెళ్ళి నగరంలోని స్టెర్లింగ్
రోడ్ లోవున్న స్టేటస్ కో బిల్డింగ్ పైకి చేరి చుట్టూ కని
పించే మద్రాసు
నగరాన్ని విద్యుత్ కాంతుల్లో వీక్షిస్తూ తన
కిష్టమయిన సినిమా పాటలు వింటూ అద్వితీయమైన
అనుభూతిని ఆస్వాదించేవాడు.
ముసలివాడివవుతున్నావనే కామెంట్ ని కోభన్ బాబు
అంగీకరించలేక 2001 తర్వాత ఇల్లు వదిలి రావడం మానే
శాడు. నలుగురికి కనిపించడానికి ఇష్టపడేవారు కాదు.
వయసుతో ముఖంలో వచ్చిన మార్పులను అంగికరం
చలేని మనస్తత్వం ఆయనకు ఆలవడిందన్నారు.
ఏడుపదుల వయసులో ముడుతలు పడిన ముఖం,
బట్టతలతో పదిమందిలోకి వెళితే తన రూపం చూసిన
అభిమానులు జీర్ణించుకోలేరని శోభన్ బాబు వివరించి
చెప్పేవాడు. వాస్తవానికి ఆయనలో వచ్చిన మార్పును
ఆయనే అంగీకరించలేకపోయాడు.
చివరి రోజుల్లో శోభన్బాబులో అపరాధభావం ఏర్పడిం
దేమో! సినీపరిశ్రమ నుండి డబ్బు తీసుకోవడమే తప్పించి
సినీ ఇండస్ట్రీకి ఆయన చేసిందేమీ లేదన్న ఆలోచన
కలిగింది. తనను ఎవరూ గుర్తు పెట్టుకోలేమో!
పరిశ్రమలో ఎవరికీ సహాయం చేయలేదు. సహాయ
పడేలా సినిమాలు తీయలేదు. స్టూడియోలు పెట్టలేదు.
ఏ రాజకీయ పార్టీలతో సంబంధం లేదు. అసలు ఒక్క
సారికూడా ఓటు వెయ్యలేదు.
డబ్బు పై వ్యామోహం పెంచుకుని సంపాదనే ధ్యేయంగా
బతికిన తనను ఎవరైనా ఎందుకు ఆదరించాలన్న ప్రశ్న
ఆయన మనసును చివరిరోజుల్లో తొలిచివేసింది.
శోభన్ బాబుకి సంపదకి కొదవలేదు. చాలామంది
సినిమానటులకుండే వ్యసనాలు లేవు. చక్కని ఆరోగ్యం.
కుటుంబపరంగా ఒడుదుడుకులు లేవు. సంతానాన్ని
సినీరంగంలోకి తీసుకురాలేదు. తెచ్చి వారు సరిగా స్థిర
పడకపోతే బాధ. స్టూడియోలకు దూరంగా ఆస్తులను
కాపాడుకునే బాధ్యతలు అప్పగించాడు.
తాను డబ్బుమనిషి అని, తనని పిసినారి అని ఫిల్మ్
ఇండస్ట్రీ భావించిందని తెలుసు. అందుకేనేమో తెలుగు
చలనచిత్ర పరిశ్రమ 75 ఏళ్ళ ప్లాటినమ్ ఉత్సవానికి
ప్రత్యేకంగా పిలిచినా రాలేదు. పైగా శోభన్
బాబు ఎవరినీ
కలవడం లేదని, గది దాటి
బయటకు రావడం లేదని
తన 72 ఏళ్ళ రూపాన్నిచూపించేందుకు ఇష్టం
లేనట్టుగా ప్రవర్తిస్తున్నా
డని, అదో రకమైన మాన
సిక ఇబ్బందన్న వార్తలు
గుప్పుమన్నాయి.
శోభన్బాబుకు ప్రతి
రోజూ హిందూదినపత్రిక
చదవడం అలవాటు. యోగా చేసి, మల్లెపూల వంటి తెల్ల
డ్రెస్ వేసుకుని రాకింగ్ ఛైర్ లో ఊగుతూ తన ఇంటిలో
కూర్చోవడం ఆయనకు ఇష్టమైన దినచర్య.
కాని ఫిబ్రవరిలో శోభన్బాబు చెల్లి ఝాన్సీ మరణించి
నప్పటినుండి ఏదో నలత. ఏడుపు ఆపుకోలేకపోయాడు.
ఆది ఆమెమీద ప్రేమో లేక తానూ వయసు మీదపడి
మరణానికి దగ్గరవుతున్నాననే భయమో!
తనకు తానుగా ధైర్యం చెప్పుకోవడం మొదలెట్టాడు.
నాకేమీ కాదు మరో 20 ఏళ్ళు. 50 ఏళ్ళు. 70 ఏళ్ళు....
హాయిగా బతుకుతా! అని. కాని ఎక్కడో సందేహం. ఆ
సందేహమే నిజమయ్యింది.
రోజూ ఉదయంలాగానే తన కిష్టమైన రాకింగ్ చైర్ లో
కూర్చుని అల్పాహారానికై ఎదురుచూస్తున్న శోభన్బాబు
అలాగే కుప్పకూలి, కానరాని లోకాలకు వెళ్ళిపోయాడు.
శోభన్ అభిమానులు వందలాది నుంచి చెన్నై వెళ్ళి హోరున
వర్షం కురుస్తున్నా లెక్క చెయ్యక శాంతినికేతన్లో అంత్య
క్రియలయ్యేవరకు శోకతప్తులయ్యారు.

A YOUNG SUCCESSFUL RACER

SUCCESSFUL WOMAN CHEFS

CHANAKYA NEETHI


25, ఏప్రిల్ 2012, బుధవారం

LAST DAYS OF ACTRESS MADHUBALA



ఆమె అందంలానే ఆమె పేరూ అందమైనదే!
బాలనటిగా సినిమాల్లోకి ప్రవేశించిన మధుబాల
ఆ తర్వాత తన అందంతో, అభినయంతో ప్రేక్షకులను
ఆకట్టుకుంది.ఆమె చనిపోయిన రెండు దశాబ్దాల తర్వాత
1990లో ఓ సినిమా పత్రిక నిర్వహించిన బ్యాలెట్ లో
అత్యంత ప్రజాదరణ పొందిన ఏకైక హీరోయిన్ గా మధు
బాల ఎంపికైంది. దటీజ్ మధుబాల.
డైరెక్టర్ కమల్ అమ్రోహి, నటుడు ప్రేమనాథ్, అశోక్
కుమార్, దిలీప్ కుమార్, కేదార్ శర్మ, జుల్ఫికర్ ఆలీ భుట్టో
లను ప్రేమించి, వారిచేత ప్రేమించబడి చివరికి గాయ
కుడు కిషోర్ కుమార్ కి పేరుకే భార్యగా మారి, ప్రేమాభి
మానాలకు నోచుకోలేక, అర్ధాంతరంగా 36 ఏళ్ళకే జీవి
తాన్ని ముగించేసిందంటే విధి ఎంత బలీయమో!!
తండ్రి అతుల్లాఖాన్ అంటే ఆమెకెంతో గౌరవం.
ఆయన పదకొండుమంది సంతానంలో మధుబాల ఐదవ
బిడ్డ. తండ్రి మాట జవదాటాలంటే ఆమెకు భయం. ఆ
భయమే ఆమె జీవితాన్ని విషాదాంతంలో ముంచింది.
మధుబాల అసలు పేరు ముంతాజ్ జాన్ బేగం.
ముద్దు పేరు మజిలీ అప్పా. మధుబాలకు చిన్నప్పుడే
గుండెజబ్బు ఉంది. ఆ జబ్బుందన్న సంగతి ఆమెకు
తెలీదు. ఆ విషయం ఆమె తండ్రి దాచాడు.
ప్రముఖ నటుడు దిలీప్ కుమార్ ప్రేమను గెలుచు
కున్నా తండ్రి వ్యతిరేకతతో అతన్ని దూరంచేసుకుంది.
ఇది ఆమె జీవితంలో పెద్ద విషాదం. లేకుంటే అతనికి
భార్య అయ్యేది. దిలీప్ అంటే ఆమెకెంతో ఇష్టం.
17 సంవత్సరాల వయసులో దిలీప్ కుమార్ సరసన
నటించింది. ఆమె అందానికి ముగ్ధుడైన దిలీప్ కుమార్
కూడా మధుబాలను ప్రేమించాడు. తండ్రి అతుల్లాఖానకు,
దిలీప్ కుమార్‌కు మధ్య మనస్ఫ
ర్థలు రావడంతో దిలీపు
దూరంకావలసి వచ్చింది.
దిలీపుమార్ను వదులు
కున్నాక తానెంత తప్పుచేశానో
అర్థంచేసుకుంది ఆమె. ప్రేమకు
దూరమై కృంగిపోయింది. మాన
సికంగా దెబ్బతింది. దాంతో ఆమె
ఆరోగ్యం క్రమేపీ క్షీణించింది.
అటువంటి సమయంలో
కె.ఎ.ఆసిఫ్ 'మొఘల్ ఎ ఆజమ్'
చిత్రంలో దిలీప్ కుమార్ పక్కన
నటించే అవకాశంవచ్చింది. కాద
నలేకపోయింది. కారణం ప్రియు
డితో నటించే అవకాశం రావడం
ఒకటైతే, అనార్కలి వంటి గొప్ప
పాత్ర లభించడం రెండు.
వెంటనే ఓ.కే. చేసింది.
కానీ ఆ సినిమా షూటింగ్
జరుగుతున్నంతకాలం మధు
బాల తండ్రి ఆమెకు కాపలాగా
వుండటంతో దిలీపుమారో
మాట్లాడలేకపోయింది.
ఆమె తండ్రి అలా తమని
మాట్లాడుకోనీకుండా జాగ్రత్తపడ
టంచూసి అతనికి ఇబ్బంది అని
పించి, తటస్థంగా వుండిపోయేసరికి ఇద్దరూ ఎడమొఖం
పెడముఖంగా ఉండిపోయారు.ఆ చిత్రం పూర్తయ్యేలోగా
ఆమె ఆరోగ్యం మరింత దెబ్బతింది. అనారోగ్యంవల్ల ఆమె
తూలిపోతూండేది. ఆఖరి సీ లో నటించేప్పుడు సంకెళ్ళ
వల్ల చేతులకు, కాళ్ళకు గాయాలయ్యాయి.ఆమె ప్రేమే ఆమెకు
శత్రువైంది. ఏ ఒక్కరితోటి
ప్రేమ సక్సెస్ అవ్వక కృంగి
పోయింది. ఆ సమయంలో
కిషోర్‌కుమార్ గాయకుడిగా
పరిచయమై, అప్పుడప్పుడే
పైకొస్తున్నాడు.
అతన్ని వివాహం చేసు
కుంటే తనకో తోడు దొరు
కుతుంది అనుకుంది. ఆ

సమయంలో అప్పుల్లో మునిగివున్న కిషోర్ కుమార్ మధు
బాల అడగ్గానే ఆనందంగా ఒప్పుకున్నాడు.ఆమెను వివా
హం చేసుకున్నాడు. మధుబాలవల్ల అప్పుల ఊబిలోంచి
బైటపడ్డాడు.
కానీ ఆమె అంటే అతనికెంతమాత్రం ప్రేమ
లేదు. దాంతో ఇద్దరి మధ్య ఘర్షణలొచ్చాయి.
చివరికి అనారోగ్యంతో 1960ల్లో తన నట జీవితా
నికి స్వస్తి చెప్పింది. ఇంత చేస్తే అప్పటికి ఆమె వయసు
28 సంవత్సరాలే. గుండెజబ్బు తీవ్రమవడంతో మెరుగైన
చికిత్సకోసం ఇంగ్లండ్ కు వెళ్ళింది.ఆమె పరిస్థితిని చూసిన
డాక్టర్లు పెదవి విరిచారు. గుండె ఆపరేషన్‌కు తట్టుకోలేదని
స్థిరనిశ్చయానికి వచ్చారు. అదే చెప్పారు.
.
తిరిగి మాతృదేశం చేరుకుంది మధుబాల.
'ఆరాధన' సినిమా 1969లో విడుదలైంది.ఆ చిత్రంలో
కిషోర్‌కుమార్పడిన పాటలకు దేశమంతా ఉర్రూతలూగి
పోయింది. గాయకుడిగా డిమాండ్ పెరిగింది. ఆఫర్స్
ఇబ్బడి ముబ్బడిగా వచ్చిపడ్డాయి. ఆర్థికంగా కుదుట
పడ్డాడు. మధుబాలను నిర్లక్ష్యం చేశాడు.
.
ఏ ఒక్కరి ప్రేమా దక్కక చివరి రోజుల్లో అల్లాడి
పోయింది మధుబాల. కనీసం నోరారా పలకరించే మనిషే
లేడు. అప్పుడప్పుడు వచ్చి పలకరించే తన పుట్టింటివారు,
ఒకరిద్దరు సన్నిహితులు తప్ప ఇంకెవరూ వచ్చేవారు
కాదు. ఒంటరిగా వున్న సమయంలో తన ప్రేమికుల
గురించే ఎప్పుడూ ఆలోచిస్తూ వుండిపోయేది.
మధుబాల ఢిల్లీ నగరంలో వుండగా, ఇంకా ఆమె
అప్పటికి ముంబై చేరలేదు. సినిమాల్లోకి రాలేదు. ఆ
రోజుల్లో ఆమెకు లతీఫ్ అనే ఫ్రెండ్ వుండేవాడు. ఆమె
వస్తూవస్తూ అతనికో గులాబీపువ్వు ఇచ్చింది.చివరి రోజుల్లో
ఆమెకు అతను తరచుగా గుర్తిస్తుండేవాడు.
కేదార్ శర్మ, కమల్ అమ్రోహి, ప్రేమ నాథ్, అశోక్
కుమార్, దిలీప్ కుమార్, జుల్ఫికర్ ఆలీ భుట్టో, కిషోర్
కుమార్ ఇలా వరుసగా వారంతా ఆమె చివరి రోజుల్లో
గుర్తుకురాసాగారు. తన డైరీలో వారందరి జ్ఞాపకాలను
రాస్తూ, బాధపడుతూ వుండేది.
ఆఖరి ఘడియలు వచ్చాయని ఆమెకు అర్థమయ్యే
సరికి తానెంతో గాఢంగా ప్రేమించిన దిలీపుమారు
కలవరించడం మొదలు పెట్టింది. ఒక్కసారి వచ్చి కలసి
వెళ్ళమని ఉత్తరాల ద్వారా ప్రాథేయపడింది. దిలీప్
రాలేదు. ఆమెను పూర్తిగా మరిచిపోయాడు.ఆమె అప
రాధాన్ని అతను క్షమించలేకపోయాడు.
అయితే కూతురి దుఃఖాన్ని చూసిన ఆమె తండ్రి
కరిగిపోయాడు. ఒక్కసారి వచ్చి చూసి వెళ్ళమని ప్రాధేయ
పడ్డా దిలీప్ కరగలేదు. ఆ విషయం తెలిస్తే మరింత
బాధపడుతుందని తండ్రి చెప్పలేదు. దాంతో తీరని వేద
నతో అనారోగ్యం నుండి కోలుకోలేకపోయింది. చివరి
వరకు దిలీప్ కోసమే
నగరంలో వుండగా, ఎదురుచూసింది.
-డ్ వుండేవాడు. అంత దుఃఖాన్ని ఆమె
అతనికో గులాబీ
గుండె మోయలేకపో
యింది. 1969 ఫిబ్రవరి
ఆమె మరణించాక
23వ తేదీన మధుబాల
విధుబాల ఇచ్చిన
తనువు చాలించింది. ఆమె
ఆమె సమాధిమీద మరణించినా అభిమానుల
అలర్పించాడు.
గుండెల్లో చిరస్థాయిగా
మిగిలేవుంది.
దిలీప్ కుమార్ ఆఖరి క్షణంలో శ్మశానానికైనా వస్తా
డనుకున్నారంతా. అతను రాలేదు. మధుబాల తండ్రి
ఆమె డైరీని కూడా సమాధిచేశాడు.
మధుబాల మరణించాక ఆమె బాల్యమిత్రుడు
లతీఫ్ తనకు మధుబాల ఇచ్చిన గులాబీ పువ్వును ఆమె
సమాధి మీద ఉంచి నివాళులర్పించాడు. ఆమె జ్ఞాపకంగా
దాచుకున్నాడా గులాబీ పువ్వు.
ఆమె మరణించేనాటికి లతీఫ్ ఓ ఐఏఎస్ అధికారి.
ప్రతి సంవత్సరం ఆమె చనిపోయిన రోజు ఆమె సమాధి
మీద ఓ గులాబీ పువ్వును వుంచి వెళ్తుంటాడు.
'ప్యార్ కియాతో డర్‌
జబ్ ప్యార్ కియాతో
డర్‌ క్యా' 'మొఘల్ ఎ ఆజమ్'లో మధుబాల నర్తిస్తూ
నటించిన ఆ పాట మన చెవుల్లో ఇప్పటికీ, ఎప్పటికీ విన
బడుతూనే ఉంటుంది.
మధుబాల ఢిల్లీ నగరంలో వుండగా,
లతీఫ్ అనే ఫ్రెండ్ వుండేవాడు.
ఆమె వస్తూవస్తూ అతనికో గులాబీ
పువ్వు ఇచ్చింది. ఆమె మరణించాక
లతీఫ్ తనకు మధుబాల ఇచ్చిన
గులాబీపువ్వును ఆమె సమాధిమీద
ఉంచి నివాళులర్పించాడు. 

Featured post

MANALO MANAM ...MANATHO MANAM