EACH AND EVERY POSTING IN THIS BLOG IS UNIQUE. SUCCESS SUTRAS OF WINNERS IN VARIOUS FIELDS OF THE SOCIETY , SKILLS FOR BETTER LIFE , BEHAVIOURAL TIPS TO MANAGE VARIOUS SITUATIONS ETC VALUABLE INFO IS PROVIDED TO MAKE YOU INSPIRE ,FIGHT AND WIN IN THE LIFE.THANK YOU .
29, ఏప్రిల్ 2012, ఆదివారం
28, ఏప్రిల్ 2012, శనివారం
IN THE LAST DAYS OF TANGUTURI PRAKASAM PANTHULU
Tanగుటూరి ప్రకాశం పంతులుగారు ఆంధ్రుల
అభిమాన నాయకుడు. ఆంధ్రకేసరిగా పిలు
చుకోబడిన వ్యక్తి. సంయుక్త మద్రాసు రాష్ట్రానికి ముఖ్య
మంత్రిగా పనిచేశారు. తెలుగువారి తొలి రాష్ట్రం ఆంధ్రకు
తొలి ముఖ్యమంత్రి టంగుటూరి.
జవహర్లాల్ నెహ్రూతో సహా ఎవ్వరితోనైనా అవసర
మైతే ఢీ కొనటానికి వెనకాడనివాడు. బారిష్టర్ గా ఆ
రోజుల్లోనే లక్షలాది రూపాయల్ని ఆర్జిస్తున్న ప్రకాశం దేశ
స్వాతంత్ర్యం సర్వం త్యాగంచేశారు.
చెన్నపట్నం, రాజమండ్రి, ఒంగోలులో భవంతులు
నిర్మించుకుని ఆ రోజుల్లోనే ఖరీదైన కార్లలో తిరిగినవాడు.
ఆంధ్రులకు ప్రత్యేక రాష్ట్రం కోసం పోరాటం చేసి తీర్మా
నం చేయించి కర్నూలు రాజధానిగా రాష్ట్రాన్ని సాధించి
ముఖ్యమంత్రి పదవీ బాధ్యతలు చేపట్టారు.
కాంగ్రెస్ ని వీడి ప్రజా పార్టీ పెట్టి సీట్లు గెలుచుకుని
కాంగ్రెస్ తో కలిసి సంకీర్ణ
ప్రభుత్వం ఏర్పాటుచేశాడు.
ఆయన నిర్ణయాలు తీసుకునే సాహసి.
ఇలా ముఖ్యమంత్రి అవగానే అలా కృష్ణా బ్యారేజ్
నిర్మాణం చేపట్టారు. అటు తిరుపతిలో శ్రీ వేంకటేశ్వర
విశ్వవిద్యాలయాన్ని ప్రారంభించారు.
కొందరు నాయకులను, కాంగ్రెస్ అధిష్టానం దగ్గరికి
తీసింది. ప్రకాశం పంతులుకు ప్రజలలో వున్న పలుకుబడి
తెలుసు కాబట్టి ఆయనతో ప్రత్యక్షంగా పోరాటం చేసే
సాహసం కాంగ్రెస్ నాయకులకు లేదు. అయినా ప్రకాశంని
ముఖ్యమంత్రిగా కొనసాగించడం ఇష్టం లేదు.
ప్రకాశం అంటే సి.రాజగోపాలాచారికి పడదు. రాజాజీ
చెప్పే పితూరీలలో జవహర్లాల్ నెహ్రూ ప్రకాశం మీద
కసి పెంచుకున్నారు. ఫలితం 1953 అక్టోబరులో ఏర్పడిన
ఆంధ్రరాష్ట్ర తొలి మంత్రివర్గం నవంబరు 1954 నాటికి
పతనమైంది. ముఖ్యమంత్రి టంగుటూరి ప్రకాశం పై
అవిశ్వాస తీర్మానం నెగ్గింది.
అది కుట్రపూరితంగా నెగ్గించిన తీర్మానమని అంద
రికీ తెలుసు. రాజ్యాంగబద్ధత లేని స్పీకర్ చర్య. అయినా
సరే ప్రకాశం పంతులు తన రాజీనామా సమర్పించి పదని
నుండి తప్పుకొనగా రాష్ట్రపతి పాలన వచ్చింది.
ప్రకాశం పంతులుని తిరిగి కాంగ్రెస్ పార్టీలోకి తెచ్చి
తన అధీనంలో పనిచేయించాలన్నది నెహ్రూ పట్టుదల.
అందుకు ప్రకాశంలోని
స్వాభిమానం అంగీకరించ
లేదు. ప్రజాపార్టీ, కాంగ్రెస్
పార్టీలు కలసి తిరిగి ఎన్నికల్లో gelichayi.
Appatiki అందరూ
తిరిగి ప్రకాశంగారే ముఖ్య
మంత్రి కావాలనుకున్నారు.
కానీ కాంగ్రెస్ అధిష్ఠానవర్గం
ప్రకాశంని భరించే స్థితిలో లేదు. నాటి కాంగ్రెస్ అధ్యక్షులు
చేబర్, లాల్ బహదూర్ శాస్త్రీలు స్వయంగా
విజయవాడ వచ్చి ప్రకాశంపంతులు ముఖ్య
మంత్రి అభ్యర్థి కాకుండా వుండేందుకు
వేయాల్సిన ఎత్తుగడలన్నీ వేశారు.
ప్రకాశం గారు ప్రజల మనిషి. ఒకవైపు తనకు వ్యతి
రేకంగా కాంగ్రెస్ ఎత్తుగడలు వేస్తున్నప్పటికీ ప్రజలు
- మద్దతుంటే అవుతాం. లేకుంటే లేదన్నంత ధీమాతో
విజయవాడ మండుటెండలో నెత్తిన తడిగుడ్డ వేసుకుని
సమీపంలోని పల్లెటూరికి ఒక ఎంక్వయిరీకి వెళ్ళారు.
అప్పటికి ప్రకాశం పంతులు గారి వయసు 83. ఆ ఎండ
లోనే వచ్చి గెస్ట్ హౌస్ లో నిద్రపోయారు.
కాంగ్రెస్ అధిష్టానం "ఆయన పెద్దవారయ్యారు కదా"
అని ప్రకాశంగారిని వదిలించు
కోవాలనుకున్నారు.
ప్రకాశంగారి స్థానంలో
గోపాలరెడ్డి గారిని ముఖ్య
మంత్రిగా ముందుగానే ప్రక
టించారు. ఆ విధంగా ప్రకాశం
గారికి చివరి రోజుల్లో ఆయన
ద్వారా ఎదిగినవారే రాజకీయ
ద్రోహం చేశారు.
1954 నాటికి కంటిచూపు
కొద్దిగా తగ్గింది. కాగితాలు
బాగా దగ్గర పెట్టుకుని గాని
చదవలేకపోయేవారు.
అంతకు ముందు ప్రకాశం
గారు రోజుకు రెండు గంటలు
నడిచేవారు. ఇప్పుడు పొద్దున పదినిమిషాలు, సాయంత్రం
పది నిమిషాలతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది.
మనిషి వెంట ఉంటే కాని పర్యటనలకు వెళ్ళలేని పరి
స్థితి. అయినా హైదరాబాద్, విజయవాడ, చెన్నపట్నాల
మధ్య పర్యటనలు చేస్తూనే వున్నారాయన.
ప్రకాశం గారికి ఇతరత్రా ఆదాయం లేదు. ఆస్తులు
ఒకదాని తర్వాత ఒకటి కరిగిపోయాయి. మద్రాసులో
స్వరాజ్య పత్రిక ప్రారంభించిన భవనాన్ని కోర్టు వేలంలో
కొన్నవారు, అదనంగా వచ్చిన డబ్బు ప్రకాశంగారికి ఇస్తా
మని అన్నారేగాని ఇవ్వలేదు. వయసు మీదపడినా కారు
ప్రయాణాలు చేయడం మానలేదు.
కొన్ని సందర్భాల్లో ఆయనకు కారులో పెట్రోలు
కొట్టించుకునే స్టోమత లేకుండా పోయింది. ఒకనాడు
దక్షిణ భారతదేశంలో ఒక వెలుగు వెలిగిన ఆంధ్రకేసరి
అవసానదశలో ఆర్థిక ఇబ్బందులెదుర్కొన్నాడు.
ఈలోగా తెలుగు వారందరూ కలలుకన్న ఆంధ్రప్రదేశ్
ఏర్పడింది. ఆంధ్రప్రదేశికి ప్రకాశం ముఖ్యమంత్రి అవుతారని ఆశించినవారికి
కాంగ్రెస్ పార్టీ నిరాశనే మిగి ల్చింది. ప్రకాశంగారు ప్రజ
లతో మమేకమవుతూనే
ఉన్నారు. 1957 మే నెలలో తీవ్ర ఎండలలో ఒంగోలుప్రాంతం పర్యటనకెళ్ళాడు.
ఆయనకు వడదెబ్బ తగిలింది.
HYD cherina tharవాత కూడా ఆయన వడదెబ్బ నుండి కోలుకోలేదు.
వయసుతో వచ్చిన అనారోగ్యానికి ఎండదెబ్బ తోడనగా
ఉస్మానియా ఆసుపత్రిలో చేరక తప్పలేదు.
ఆసుపత్రిలో వున్న ప్రకాశంగారికి 18 రోజుల
చికిత్స తర్వాత ఆక్సిజన్ పెట్టాలన్నారు వైద్యులు. కాని
ఆయన అంగీకరించలేదు. ప్రకృతి చికిత్సను నమ్మిన
వాడు కాబట్టి కృత్రిమంగా ప్రాణవాయువు పీల్చడమా,
కాదు పొమ్మన్నారు. ఆయన మాటను కాదని ఆక్సిజన్
పెట్టే సాహసం వైద్యులు చెయ్యలేదు.
అప్పటికి ఆసుపత్రిలో చేరి ఇరవై రోజులు. ఆయన
ఆరోగ్యం ఏమాత్రం మారలేదు. కళ్ళు మూతలుపడు
తున్నాయి. ఆయన మిత్రులు వైద్యులచేత ఆక్సిజన్
ఏర్పాటుచేయించారు. దానిని వద్దనలేని పరిస్థితి ఆయ
నది. ఆక్సిజన్ పెట్టినా ఆయన
పరిస్థితిలో మార్పు రాలేదు.
కఫం కమ్ముకుని వచ్చింది.
ఊపిరితిత్తులు వ్యాధిపూరిత
మయ్యాయి.
సాయంకాల సమయంలో
కొడుకు, కోడలు, మనుమలు,
మనుమరాళ్ళు ఆయన ఆవ
స్థను చూసి బాధపడుతున్నారు.
వైద్యనిపుణులు ఆయన
ప్రాణం కాపాడేందుకు తమ
వంతు కృషి చేస్తున్నారు.
అంతకు కొద్దిసేపు ముందు
తనను తప్పించి అధిష్ఠానం
అండతో ఆంధ్రరాష్ట్ర ముఖ్య
మంత్రి అయిన గోపాలరెడ్డిగారు చూసేందుకు వచ్చారు.
ఆ విషయం ఆయన గమనించే స్థితిలో లేడు. అయినా
కొడుకు వారి రాకను చెవిలో చెప్పేసరికి కళ్ళు సగం
తెరిచి ఏదో చెప్పేందుకు ప్రయత్నించారు. కాని మాటలు
బయటకు రాలేదు. కళ్ళు మూతలుపడ్డాయి.
రాత్రి 7 గంటల 35 నిమిషాలకు ప్రకాశం ఆత్మ
జ్యోతి ఈశ్వరజ్యోతిలో కలిసిపోయింది. జీవితకాలంలో
విశ్రాంతి అన్న మాట వినటానికి కూడా సహించని నాయ
కుడు సుదీర్ఘ విశ్రాంతిలోకి వెళ్ళిపోయాడు.
“చెన్నపట్నంలో సైమన్ కమిషన్ బహిష్కరణ ఉద్యమ
సమయంలో ఎక్కు పెట్టిన పోలీసు తుపాకీకి పేల్చు
కోండని ఛాతీ చూపించిన సాహసి ప్రకాశం.
ఆయన సర్వస్వం స్వాతంత్ర్య సమరానికి త్యాగం
చేశాడు. ప్రముఖ న్యాయవాదిగా గొప్ప ఆస్తి సంపాదిం
చాడు. కాని నిన్న ఆయన మరణించేనాటికి ఒక రాగి
పాత్ర అయినా ఆయన దగ్గర మిగలలేదు" అంటూ
నాటి లోకసభ స్పీకర్ మాడభూషి అనంతశయనం
ఆయ్యంగారు నివాళులు అర్పించారు.
రాజకీయాలు ప్రజాసేవకోసం అని భావించిన తరం
వాడు ప్రకాశం. అందుకే ఆయన ఆస్తులను పోగొట్టుకు
న్నాడే కాని రాజకీయాలలో సంపాదించలేదు. ఆయన
చివరి రోజుల్లో ఆర్థికంగా ఇబ్బందులు పడ్డారు.
నా అనుకున్న వారి దగ్గర చనువుగా డబ్బు తీసేసుకునే
వారట.ఆలా తీసుకున్నదానిలోనే కొంత ఆవసరాల్లో వున్న
వారికిచ్చేసేవారు. అధికారం వున్నా లేకున్నా ఆయన ఆంధ్ర
కేసరి. తనకంటూ ఏమీ మిగుల్చుకోలేదు ప్రజాభిమానం
• తప్ప. అదే ఆయన మహోదార్యం.
27, ఏప్రిల్ 2012, శుక్రవారం
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
పోస్ట్లు (Atom)
Featured post
-
మనరాష్ట్రంలో హోమియోపతి వైద్యం అంటే గుర్తుకొచ్చే మొదటి వ్యక్తి పావులూరి కృష్ణ చౌదరి. హోమియో వైద్య వ్యాప్తికి ఆయన ఎంతో కృషి చేశారు. ఈరోజున రాష...
-
Tanగుటూరి ప్రకాశం పంతులుగారు ఆంధ్రుల అభిమాన నాయకుడు. ఆంధ్రకేసరిగా పిలు చుకోబడిన వ్యక్తి. సంయుక్త మద్రాసు రాష్ట్రానికి ముఖ్య మంత్రిగా పనిచేశా...
