పోస్ట్‌లు

మహిళా జన అధికార్ సమితి,అజ్మీర్, రాజస్థాన్.

చిత్రం
 డిజిటల్ యుగానికి అనుగుణంగా గ్రామీణ మహిళలకు నైపుణ్యాలను అందించడానికి ఎం జె ఏ ఎస్ చేస్తున్న ప్రయత్నాల్లో ఈ ఫిల్మ్ మేకింగ్ కోర్స్ ఒక భాగం. మొదట అన్హాద్ ఫిలిమ్స్ వీరికి శిక్షణ ఇచ్చింది .ఇప్పుడు డిజిటల్ రంగంలో అగ్రగామిగా ఉన్న పీర్ నేతృత్వంలోని మోడల్ విజయవంతం అయింది. వీరి ఆధ్వర్యంలో శిక్షణ పొందిన మహిళలు ఇప్పుడు ఇతరులకు ట్రైనింగ్ ఇస్తున్నారు. బాల్యవివాహాల  సంకెళ్లలో చిక్కుకొని కష్టాల పాలైన అజ్మీర్ గ్రామీణ మహిళలు ఇప్పుడు చిన్న చిన్న సినిమాలను రూపొందిస్తున్నారు .డిజిటల్ యుగానికి అనుగుణంగా ఈ గ్రామీణ మహిళలు సాంకేతిక నైపుణ్యాలను నేర్చుకుని మహిళా కార్మికుల దయనీయ జీవితాలు గృహహింసపై అవగాహన కల్పించే ప్రయత్నం చేయడమే కాదు.. చాలావరకు విజయం సాధించారు కూడా . వీరు తమ ఆలోచనలను  సినిమా రూపకంగా గ్రామీణుల ముందుకు తీసుకువచ్చి సరికొత్త జీవన విధానం గురించి అవగాహన కల్పిస్తున్నారు. డిజిటల్ రంగంలో నైపుణ్యం సాధి ంచిన వీరు శిక్షకులుగా మారి మారుతున్న గ్రామీణ భారతానికి ఉదాహరణగా నిలుస్తున్నారు. రాజస్థాన్లోని అజ్మీర్ లో అత్యంత సామాన్యంగా ఉండే రెండు అంతస్తుల భవనం ఉంది .అక్కడ ప్రతి ఉదయం ఒక నిశ్శబ్ద విప్లవం మేల...

షీల్డ్ షూర్ ఇన్సూరెన్స్ ,థానే

చిత్రం
 చిన్న పట్టణాలకు చెందిన ముగ్గురు మహిళలు కలిసి మన దేశ భీమా రంగంలో కొత్త అధ్యాయానికి శ్రీకారం చుట్టారు సంకల్ప బలం కలిగిన ఆ మహిళలు ఎవరంటే నైనా చౌహాన్ ,అనుశ్రీ వాస్తవ, షీబా నాజ్. ఈ ముగ్గురు మహిళలు మన దేశంలో తొలిసారి డిస్కౌంట్ ఆధారిత బీమా స్టార్టప్ షీల్డ్ ఇన్సూరెన్స్ ప్రారంభించారు. థానే ప్రధాన కేంద్రంగా ప్రారంభమైన ఈ స్టార్టప్ కు నైనా చౌహాన్ ఫౌండర్, అను శ్రీ  శ్రీ వాస్తవ కో ఫౌండర్, షీబా నాజ్ సి ఓ ఓ గా వ్యవహరిస్తున్నారు. ప్రతి భారతీయ కుటుంబానికి భీమాను అందుబాటులోకి తీసుకురావాలి అనే లక్ష్యంతో స్టార్టప్ ప్రారంభించారు వీరు. మిగిలిన కంపెనీలతో పోల్చితే షీల్డ్ ష్యూర్ ను ప్రత్యేకంగా నిలబెట్టేది మహిళా సాధికారికత పట్ల దాని బలమైన నిబద్ధత అంటుంది కోపౌండర్ అనుశ్రీ. దీనిలో 90 శాతం మందికి పైగా ఉద్యోగులు మహిళలే కావడం విశేషం. క్షేత్రస్థాయిలో కూడా ఎక్కువమంది మహిళలే ఉండేలా చూసుకోవాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. మా లక్ష్యం బీమాను అందుబాటులోకి తీసుకురావడమే కాకుండా భారతదేశం అంతటా మహిళలకు ఆర్థిక స్వాతంత్రాన్ని సృష్టించడం అంటుంది ఫౌండర్ నైనా. ప్రతి బీమా పాలసీపై ఐదు నుండి 25% డిస్కౌంట్ కూపన్లను అందిస్తోంది వ...

పర్యావరణహిత.. ప్రాజెక్టు ముంబై

చిత్రం
 ప్లాస్టిక్ వ్యర్ధాలను పునర్వినియోగంలోకి తీసుకురావడానికి ముంబైలోని స్వచ్ఛంద సంస్థ " ప్రాజెక్టు ముంబై " ప్లాస్టిక్  రీసైక్లోథాన్ కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. చిన్నగా మొదలైన ఈ కార్యక్రమం ఉద్యమ స్థాయికి చేరింది. సాధారణ పౌరులు ఈ ఉద్యమంలో భాగమవుతున్నారు. ప్రాజెక్టు ముంబైకి చెందిన స్వచ్ఛంద సేవకులు ఇంటింటికి వెళ్లి ప్లాస్టిక్ వ్యర్థాలను సేకరిస్తారు. విద్యార్థుల కోసం పాఠశాలలు కాలేజీలలో అవగాహన సదస్సులు నిర్వహిస్తోంది ప్రాజెక్టు ముంబై.  పౌరుల నేతృత్వంలో ప్లాస్టిక్ ని రీసైకిల్ చేయడానికి ఏర్పడిన అతిపెద్ద సంస్థగా లింకా బుక్ ఆఫ్ రికార్డ్స్ లో చోటు సాధి ంచింది ప్రాజెక్టు ముంబై. ఇప్పటివరకు 500 టన్నుల ప్లాస్టిక్ వ్యర్ధాలను పునర్వినియోగంలోకి తీసుకువచ్చింది. పార్కులలో పిల్లలు కూర్చునే బెంచీలను ,ఆడుకునే అందమైన బొమ్మలను, అందమైన చెత్త బుట్ట లను,ఇలా రకరకాల వస్తువులను తయారు చేసి ప్లాస్టిక్ ను పునర్వినియోగంలోకి తీసుకువచ్చింది.

బెంగళూరు రమేష్ బాబు

చిత్రం
 బెంగళూరుకు చెందిన రమేష్ తండ్రి బార్బర్ గా పని చేసేవాడు. రమేష్ ఏడేళ్ల వయసులో ఉన్నప్పుడు తండ్రి చనిపోయాడు. కుటుంబ భారాన్ని భుజాల ఎత్తుకున్న తల్లి ఇండ్లలో పనిచేసేది .కుటుంబానికి ఆర్థిక ఆసరా కోసం చిన్న వయసు నుంచే న్యూస్ పేపర్ లు అమ్మడం ,పాల ప్యాకెట్లు అమ్మడం మొదలైన పనులు చేసేవాడు రమేష్ .హై స్కూల్ చదువు పూర్తయిన తర్వాత పై చదువుల కోసం రోడ్డు పక్కన చిన్న సెలూన్ షాప్ నడిపేవాడు. తాను పొదుపు చేసిన డబ్బుతో 1993లో మారుతి వ్యాను తీసు. అది అతని జీవితాన్ని మలుపు తిప్పింది. ఈ వ్యాన్ ను అద్దె కి తిప్పే వాడు.. ఒక్కొక్క మెట్టు ఎక్కుతూ రమేష్ టూర్స్ అండ్ ట్రావెల్స్ పేరుతో కార్ రెంటల్స్ కంపెనీ ప్రారంభించే స్థాయి కి చేరుకున్నాడు. రోల్స్ రాయిస్ ఘోస్ట్, బీఎండబ్ల్యూ, ల్యాండ్ రోవర్, డిఫెండర్ మొదలైన వాటితో తన కంపెనీని లగ్జరీ కార్ రెంటల్ సర్వీసెస్ స్థాయి కి తీసుకువెళ్లాడు.  ప్రస్తుతం కంపెనీ 400 వాహనాలను ఆపరేట్ చేస్తోంది. మన దేశానికి సంబంధించి లగ్జరీ టాక్సిస్ సెగ్మెంట్లో రమేష్ బాబు మార్గదర్శిగా నిలిచాడు. తాజాగా రమేష్ బాబు తన కంపెనీలోకి మూడు కోట్ల 20 లక్షల విలువైన రేంజ్ రోవర్ లాంగ్ వీల్ బేస్ తీసుకొచ్చాడు. ...

శ్యామ హంగామా.. శ్యామా ద గామా

 నవ్వించడం అంటే నవ్వులాట ఏమీ కాదు యాగం ఎవరైనా చేయవచ్చు కానీ నలుగురిని నవ్వించాలంటే మాత్రం యోగం ఉండవలసింది అలాంటి యోగాన్ని పొంది హాస్య యాగాన్ని చేస్తున్నారు ప్రముఖ స్టాండ్ అఫ్ కమెడియన్ శామా హరిణి వేసే ప్రతి పంచుపండిన ముల్లులా అది ఎవరిని గుచ్చకపోవడం ఆమె ప్రత్యేకత నలుగురు నడవని దారులు నడుస్తూ పదవుని పగలబడి నవ్వించే ఆమె ఈ విభిన్నమైన వృత్తిలోకి ఎలా వచ్చారు అందులో తన ప్రయాణాన్ని ఎలా కొనసాగిస్తున్నారు అంటే హాస్యం ఎక్కడి నుంచో పుట్టదు మన రోజువారి జీవితంలో జరిగే సంఘటనలోనే దానికి మూలాలు ఉంటాయి. నేనైతే ప్రోగ్రాములకు స్క్రిప్ట్ తయారు చేసేటప్పుడు నాకు తారాసపడ్డ సందర్భాలని తీసుకుంటా వాటినే కాస్త నవ్వు పుట్టించేలా చెబుతా అందులో వాస్తవానికి దూరంగా మనం మాట్లాడుకోలేని విధంగా ఉండే జోకులకు ఆస్కారం ఉండదు కదా బహుశా అందరూ నా హాస్యాన్ని సున్నితంగా ఉందని హుందాగా ఉంటుందని అనడానికి కారణం ఇదేనేమో దాని వల్లే నేను షోలు చేసేటప్పుడు నలుగురు కనెక్ట్ అవుతున్నారని అనుకుంటాను మనం గమనిస్తే స్కూలు కాలేజీ ఆఫీసు ఫంక్షన్లు ఇలా ప్రతి చోటా జరిగే సంఘటనలు హాస్యం తొంగి చూస్తూ ఉంటుంది మీకు ఒక ఉదాహరణ చెబుతాను మనం చిన్నప్పుడు ఇంగ...

సాగర్ కన్వర్ రాజస్థాన్

చిత్రం
 నువ్వేం చేయగలవు ఆడవాళ్లకు ఇవి అవసరమా ఇలాంటి మాటలు వినగానే నిరుత్సాహం ఆవరించి చేస్తుంది కానీ సాగర్ కన్వర్ 16 ఏళ్లకే పెళ్లి చేసిన సంప్రదాయాలు సామాజిక కట్టుబాట్లంటూ అడ్డుపడిన వాటన్నింటినీ దాటి ముందుకు వచ్చింది సేంద్రియ సాగుతూ వందల మంది మహిళల జీవితాల్లో మార్పు తెచ్చింది రాజస్థాన్లోని శిరోహి జిల్లాలోని వీరు వాడ అనేకు గ్రామం 16 ఏళ్లకే పెళ్లి చేసే అత్తారింటికి పంపించారు పుట్టింటి వాళ్ళు ఆ తర్వాత పిల్లల ఆలనా పాలన పొలం పాడిపన్నుల్లో భర్తకు సహాయం ఇలా ఒకదాని తర్వాత మరొక పని చేస్తూనే రోజులు గడిపేయడం తనకి నచ్చలేదు ఇంకా ఏదైనా చేస్తే బాగుంటుందని భావించింది ఆలోచించగా గ్రామస్తులకు ప్రధాన ఆదాయ వనరు అయిన పాల ఉత్పత్తిని పెంచేందుకు ఒక సొసైటీని ప్రారంభించాలనుకుంటే ఇంట్లో మొదట ఒప్పుకోకపోయినా తర్వాత సరైన అనడంతో తోటి వారిని కలుపుకొని ఆశ మహిళ మిల్క్ ప్రొడ్యూసర్ కంపెనీ లిమిటెడ్ పేరుతో సొసైటీ ప్రారంభించింది  గ్రామస్తులకు ఇది బాగా ఉపయోగపడి పాల ఉత్పత్తి పెంచారు 2016లో టాటా ట్రస్ట్ డైరీ మిషన్తో పాటు జిల్లాలోని మరికొన్ని సంస్థలు వీరికి సాంకేతిక సహాయం అందించాయి సాగర్ సాధించిన ఈ తొలి విజయంతో సొసైటీ విస్తరించి...

గులాల్ గోట రంగుల కళ

చిత్రం
 హోలీ అంటే మనకు రంగులే మనసులో మెదులుతాయి వాటితో పాటు సింథటిక్ వరణాలు చేసే హాని గుర్తుకొస్తుంది కానీ 400 ఏళ్ల నుంచి సహజ రంగులతో చేసే గులాల్ గోట రంగుల గురించి వింటే ఆశ్చర్యంగా అనిపిస్తుంది. ఆ కళ నీ బతికించిన  గుల్ రుక్ సుల్తానా కథ ఆసక్తికరమే గులాల్ కోట ఇది సహజరంగుల నింపిన బంతులు చూడడానికే దృఢంగా ఉంటాయి కానీ తాకి తాకగానే పగిలి రంగులు వెదజల్లుతాయి వీటిని లక్కతో చేస్తారు ప్రత్యేకమైన నైపుణ్యం ఉంటే తప్ప ఈ బంతులు చేయలేరు ఇందులోని రంగులు మనకు ఏమాత్రం హాని చెయ్యవు అందుకే వాటికి అంత డిమాండ్ ఈ కళ 400ఏల క్రితం జైపూర్లో పుట్టింది రాజ కుటుంబాలు హోలీ ఆడుకోవడానికి కొన్ని ముస్లిం కుటుంబాలు ఈ గులాల్ గోటాలని తయారు చేసేవి అప్పట్లో హోలీ వస్తే ఈ కుటుంబాలకు క్షణం తీరిక దొరికేది కాదట కాలక్రమమైన సింథటిక్ రంగుల తాకిడి వల్ల వీటికి ఆదరణ తగ్గింది అయినా కొన్ని కుటుంబాలు మాత్రం ఈ కళని అంటిపెట్టుకొని ఉన్నాయి అందులో ఆవాజ్ మహమ్మద్ కుటుంబం ఒకటి ఆయన కూతురే గుర్ కుటుంబాన్ని పోషించడం కోసం చదువుకుని చదువుకు కూడా దూరమై గులాల్ గోటాలు తయారు చేసేది తనకి మరికొందరు తోడయ్యారు వీరంతా కలిసి చేసిన వీటిని జైపూర్ లోని గోవింద్ జ...

నిధిస్ గ్రాండ్ మా సీక్రెట్

చిత్రం
 పెద్దల మాట పెరుగన్న మూట అని ఊరికే అనలేదు పెద్దల మాట నెలకు లక్షలాది రూపాయల ఆదాయాన్ని అర్జించే పెద్ద వ్యాపార సూత్రం గా మారిపోయింది ముంబై కి చెందిన రజని నిధి గ్రాండ్ మా సీక్రెట్ పేరుతో సరదాగా ప్రారంభించిన హోం మేడ్ హెయిర్ ఆయిల్ బిజినెస్ సాఫ్ట్వేర్ ఇంజనీర్లకు ఉద్యోగంలో వచ్చే జీతం కన్నా ఎన్నో రెట్లు ఎక్కువ ఆదాయాన్ని చేకూర్తుంది దీనిని బట్టి ఏదైనా పాతకాలంనాటి కబుర్లు చెప్పిన పాత పద్ధతులు పాటించిన అంతా పాత చింతకాయ పచ్చడిలే అని తేలిగ్గా తీసేసేవారు ఇకపై ఆచితూచి మాట్లాడాలేమో ఎందుకంటే అప్పటి పాత ఫారం లోనే కదా ఇప్పుడు సక్సెస్ సూత్రంగా మారిపోయింది నిధి రొటేజాకి ఆదివారం సెలవును అమ్మమ్మ ఇంటిలో సరదాగా గడపడం అలవాటు నిధి అమ్మమ్మ రకరకాల ఔషధ మూలికలను మేళ నుంచి ఒక విధమైన తలను నేను తయారు చేసేది అలా ఆమె సొంతంగా తయారు చేసిన ఆయిల్ తో నిధి తలకు మర్దన చేసి కాసేపటి తర్వాత తలస్నానం చేయించేది అమ్మమ్మ చేతిలోనే మహత్యం వల్ల నిదికి తోటి విద్యార్థులు అందరూ కోళ్లుకునేంత నల్లటి ఉత్తమ కేశ నిధి ఉండేది. చదువు తర్వాత అమ్మమ్మ ఊరికి వెళ్లడం బాగా తగ్గిపోయింది ఇంతలో దేశాన్ని అంతటినీ కుదిపేస్తున్న కోవిడ్ మహామారి గురుగ్రామం కూడ...

గిరిజన గూడెంలో తొలి మహిళా జడ్జి

చిత్రం
  తమిళనాడు జిల్లా తిరుపతూరు జిల్లా ఎలగిరి హిల్స్ కు చెందిన 23 ఏళ్ల గిరిజనురాలు వి శ్రీపతి సివిల్ జడ్జిగా అర్హత పొంది చరిత్ర సృష్టించారు సాధించారు ఇప్పటివరకు తమిళనాడులో గిరిజన మహిళా జడ్జి లేరు శ్రీపతి పరిచయం ఆరు నెలల క్రితం తమిళనాడు తిరుపతూరు జిల్లాలోని ఎలా గిరి హిల్స్ నుంచి ఒక కారు చెన్నైకి బయలుదేరింది 4:30 గంటల ప్రయాణం లోపల ఉన్నది పచ్చి బాలింత అంతకు ముందు రోజే ఆమెకు ప్రసవమయ్యా ఆడపిల్ల పుట్టింది కానీ మరుసటి రోజు చెన్నైలో తమిళనాడు పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఎగ్జామ్ ఉంది అందులో ఉత్తీర్ణత సాధిస్తే ఆమె సివిల్ జడ్జి పోస్టుగా అర్హత సాధిస్తుంది అందుకే ప్రయాణం చేస్తోంది ఆమె పేరు వి శ్రీపతి వైయస్ 23 ఆమెకు తోడుగా ఉన్నది భర్త వెంకటేష్ తండ్రి కలియప్పన్ కొండ ప్రాంతంలో పోడు వ్యవసాయం చేసుకొని తరతరాలుగా బతుకుతున్న మలయాళీ తెగలు ఆడపిల్లలు చదువుకోవడం చాలా విశేషం లా చేయడం ఇంకా విశేషం సివిల్ జడ్జి కావడం అంటే చరిత్ర చురుకైన అమ్మాయి తిరువన్నామలై లోని గిరిజన గూడెంలో కలియప్పన్ అనే మలయాళీ రైతుకు తొలి కుమార్తెగా జన్మించిన శ్రీపతి పసిపాపగానే చురుగ్గా ఉండేది తిరువన్నామలై గిరిజన గ్రామాల్లో చదువు సరిగ్గా లేదు వీళ్ళ ...

జాతీయ స్థాయికి ఎంపికైన ఉప్పల్వాయి విద్యార్థి

చిత్రం
 జనవరి 27 నుంచి ఫిబ్రవరి ఒకటో తేదీ వరకు విజయవాడలో జరిగినటువంటి సౌత్ ఇండియా సైన్స్ ఫెయిర్లు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఉప్పల్వాయి పాఠశాల నుండి ఇంటలిజెంట్ హెల్మెట్ సిస్టం అనే ప్రాజెక్టు జాతీయ స్థాయికి ఎంపిక కావడం జరిగింది. ఈ ప్రాజెక్టు 9వ తరగతికి చెందినటువంటి నినావత్ బాబులు గైడ్ టీచర్ తృప్తి శ్రీనివాస్ సహకారంతో రూపొందించడం జరిగింది. జాతియ స్థాయికి ఎంపిక కావడం చాలా సంతోషకరంగా ఉన్నదని పాఠశాల హెచ్ఎం ఆనంద్ రావు తెలిపారు

ఎంత మాట్లాడితే అంత ఆయుష్షు

చిత్రం
 

శ్రీమతి వాణి జయరాం..గాయని

చిత్రం
 

రమణ్ దీప్ కౌర్.. బొటానికా ద నర్సరీ

చిత్రం
 

నారియల్ అమ్మ..చెళ్లమ్మాల్

చిత్రం
 

పద్మ విభూషణ్ చిరంజీవి

చిత్రం